ఏపీలో కొత్తగా 191 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

-

ఏపీ కరోనా కేసులు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతున్నాయి. ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 191 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20, 70, 286 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 418 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2734 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 416 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 53 , 134 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 26 , 514 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 00 , 31 , 083 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news