ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. దేవాదాయ శాఖలో భర్తీకి గ్రీన్ సిగ్నల్ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని నిరుద్యోగుల కు ఆ రాష్ట్ర దేవా దాయ శాఖ ఓ తీపి కబురు చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని దేవాలయాల్లో పని చేసేందుకు ఆసక్తి గా ఉన్న వారిని… ఉద్యోగాల్లోకి తీసు కునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రం లోని దేవాలయాల్లో భారీ గా ఉన్న ఖాళీలను గుర్తించి… వాటిని అతి త్వరలోనే భర్తీ చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది ఆ రాష్ట్ర దేవా దాయ శాఖ.

ఆలయాల్లో ఉన్న రెగ్యులర్‌ పోస్టులన్నీ భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది దేవాదాయ శాఖ. ఇక ఈ మేరకు అతి త్వరలోనే నోటిపికేషన్‌ ఇచ్చేందుకు కూడా దేవాదాయ శాఖ అడుగులు వేస్తోంది. అంతే కాకుండా దీని కోసం ప్రత్యే క కమిటీని ఏర్పాటు చేసి… రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. కానీ.. దేవాలయాల్లో ఎడిటర్‌, పీఆర్వో, హార్టీ కల్చర్‌ అధికారి, సెక్యూరిటీ ఆఫీసర్లు మాత్రం ఇంటర్వ్యూ ద్వారానే తీసు కోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news