తెలంగాణ కంటే మా అప్పులు తక్కువే : ఏపీ మంత్రి బుగ్గన

-

కేవలం ఏపీ సర్కార్ మాత్రమే అప్పులు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ ద్రవ్యలోటు తక్కువని స్పష్టం చేశారు. తెలంగాణ ద్రవ్యలోటు 4.13 శాతం ఉంటే.. ఏపీ ద్రవ్యలోటు 3 శాతమే ఉందని వివరించారు. ఎక్కువశాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామని చేస్తున్న ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు.

2014-15లో ఏపీ ద్రవ్యలోటు రూ.20,745 వేల కోట్లుగా ఉంటే.. 2021-22 నాటికి రూ.25,195 కోట్లకు చేరిందన్నారు. ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ద్రవ్యలోటు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని బుగ్గన స్పష్టం చేశారు.

మరోవైపు.. అప్పు పుట్టిన ప్రతిచోటా..అందినకాడికి ఎడాపెడా ఏపీ సర్కార్ రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అనుమతి ఇచ్చిన అప్పుల్లో మూడు నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు..రాష్ట్ర ప్రభుత్వ అప్పుల చిట్టాను కేంద్రం మరోసారి బయటపెట్టింది. రాష్ట్రం చేసిన అప్పుల గురించి..తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

202‌2-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు నికర రుణ పరిమితి కింద.. 44వేల 574 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వివరించారు. మొదటి 9 నెలలకు 40వేల 803 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతించగా..తొలి మూడు నెలల్లోనే 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. ఏప్రిల్ వరకే….. బహిరంగ మార్కెట్ నుంచి 21వేల 890 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి మరో 13వందల 73కోట్ల 47 లక్షలు రుణం తీసుకున్న కేంద్రమంత్రి పేర్కొన్నారు. నాబార్డ్ నుంచి 40కోట్ల17లక్షలు రుణం తీసుకుందని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news