అమరావతి నిర్మాణాల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం

-

అమరావతి స్మార్ట్ సిటీ ప్రాంతంలో చేపట్టాల్సిన ముఖ్యమైన పనులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఎమ్మార్డీఏ నుంచి అమరావతి స్మార్ట్, సస్టయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడుకు పనుల బదలాయింపు చేపట్టింది. అమరావతి పరిధిలోని ముఖ్యమైన 10 ప్రాజెక్టుల పూర్తి చేసే బాధ్యత అమరావతి స్మార్ట్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడుకు అప్పగించారు.

ముఖ్యమైన పది ప్రాజెక్టులతో పాటు మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలు అమరావతి స్మార్ట్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ చేపట్టనుంది. ఈ పనులు కోసం రూ. 360 కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి శాసన రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం కోసం కృష్ణా కుడి గట్టున 15.5 కిమీ మేర ప్రభుత్వం రహదారి విస్తరణ చేయనుంది. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ పోల్స్ నిర్మాణం తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ నిధుల ఖర్చు చేయలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news