కరోనా ఉధృతి.. మరి కాసేపట్లో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం !

-

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం  ఏర్పడింది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం,వైద్య ఆరోగ్య శాఖ, మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉన్న ఉప సంఘం భేటీ కానుంది. ఈ భేటీకి హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు లాంటి సభ్యులు హాజరు కానున్నారు.

కరోనా వైరస్
కరోనా వైరస్

ఈ ఉదయం 11 గంటలకు మంగళగిరి ఏపీఐఐసీలో మంత్రి వర్గం ఉప సంఘం సమావేశం కావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఈ సమావేశం మొదలు కానున్నట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావలసిన సలహాలు, సూచనలు మంత్రివర్గ ఉప సంఘం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news