యాదాద్రి టెంఫుల్ ను కేసీఆర్ చాలా అద్భుతంగా నిర్మించారు – మంత్రి రోజా

-

యాదాద్రి టెంఫుల్ ను కేసీఆర్ చాలా అద్భుతంగా నిర్మించారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా నేడు దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు మంత్రి రోజా.

అనంతరం అర్చకులు మంత్రి రోజాకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజు స్వామి వారిని దర్శించుకోవడం సంతోషమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి నాకు మరింత ధైర్యం రెట్టింపు ఉత్సాహం ఇస్తాడని వెల్లడించారు. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు నేను మంత్రి చేసిండని.. కేసీఆర్ యాదాద్రి టెంఫుల్ ను చాలా అద్భుతంగా నిర్మించారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news