జేసీ దివాకరరెడ్డి జానీ వాకర్ రెడ్డి లాగా మాట్లాడుతున్నాడు !

-

అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర్ నారాయణ ఏపీ కాబినెట్ అనంతరం మీడియాతో మాట్లాడారు. దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. జేసీ దివాకరరెడ్డి జానీ వాకర్ రెడ్డిలాగా మాట్లాడాడని ఆయన అన్నారు.

ఇలాగే మాట్లాడితే అనంతపురం ప్రజలు మీ నాలుక కోసేస్తారని అన్నారు. చంద్రబాబు ఎంత మోసకారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న మంత్రి రైతులను,డ్వాక్రా మహిళలను మోసం చేసి 420 గా ముద్ర పడిన వ్యక్తి చంద్రబాబని అన్నారు. దివాకరరెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని దివాకరరెడ్డి కుటుంబ అకృత్యాలు గురించి తాడిపత్రిలో అందరికీ తెలుసని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఏడాదిన్నరలో 70 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news