ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌.. ఓటేసిన సీఎం జగన్‌

-

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. శాసనసభ్యులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ, వైస్సార్సీపీ నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో అభ్యర్థి విజయానికి అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా అధికార వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసింది. ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వారితోనే ఓట్లు వేయిస్తోంది.

ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 35 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు సమాచారం. మరోవైపు ఈ ఎన్నకల ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news