అత్యాచారాలను అదుపు చేయలేని సర్కార్ గద్దె దిగాలి: చంద్రబాబు నాయుడు

-

వైసీపీ సర్కార్ పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అత్యాచారాలను అదుపు చేయలేని సర్కార్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సిగ్గు లేదని… రేపులను కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రి తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రజా ఉద్యమం అవసరమని.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని, అందరం కలవాల్సిన అవసరం ఉందని… దానికి తెలుగు దేశం పార్టీ నాయకత్వం వహిస్తుందని… అవసరమైతే జైలుకు కూడా వెళ్తామని చంద్రబాబు అన్నారు. అవసరమైతే త్యాగాలు చేస్తామని చంద్రబాబు అన్నారు. హోం మంత్రి మీ పిల్లల్ని ఇలానే పెంచుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. గంజాయి తాగే వ్యక్తి ఆరేళ్ల బాలికపై  అత్యాచారం చేశాడని..విజయవాడ హాస్పిటల్ లో ముగ్గురు వ్యక్తులు ఆడపిల్లకు ముప్పై గంటల పాటు నరకము చూపించారన్నారు చంద్రబాబు. రేప్ లు టీ డీ పీ కారణం అని అంటున్నారు అసలు సిగ్గు ఉందా ? అని నిలదీశారు. లిక్కర్ పేరుతో సీఎం మెడల్స్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న రక్త చరిత్రకు సాక్ష్యం బాబాయి హత్య అని ఆరోపించారు చంద్రబాబు. మీ చెల్లి నీకెందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల కోసం తీవ్రవాదులతో పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news