జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా..? జగన్ పై షర్మిల ఆగ్రహం

-

తాను అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్‌ చేశారు.కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైయస్ షర్మిల మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా? అని ప్రశ్నించారు.నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీల మేర పాదయాత్ర చేశా అని గుర్తు చేశారు.

మీ భవిష్యత్‌ కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు అని తెలిపారు. పాదయాత్ర సమయంలో వైసీపీ అంతా నా చుట్టే తిరిగింది. నాకే రాజకీయ కాంక్ష ఉంటే వైసీపీను నేను హైజాక్‌ చేసేదాన్ని కాదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? అని నిలదీశారు. మీరు వైఎస్‌ఆర్‌ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? అని ప్రశ్నించింది.ప్రపంచంలో రాజకీయ విబేధాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు అని షర్మిల ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news