సీఎంకి అహంకారం తలకెక్కింది.. ఆర్మూర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందంటూ విమర్శలు గుప్పించారు. కోడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేను ఇద్దరం సమానమే ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఓడిపోయిన వారు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం ఎలా చెబుతారు అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఉండడం ఎందుకు మేము పాత మంత్రులు పాత సీఎం దగ్గర రివ్యూ చేసుకుంటామని బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు మా ఆత్మగౌరవం తగ్గిస్తే మా ఆత్మగౌరవం కూడా తగ్గిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ లో ఓడిన అభ్యర్థి వినయ్ రెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది ప్రజాస్వామ్యంగా వినయ్ రెడ్డి రాజకీయం చేయాలి లేకుంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. చట్టం తన పని చేయకపోతే రాకేశ్ రెడ్డి చట్టం మొదలవుతుందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news