టీఆర్ఎస్‌ పొత్తు : ఎంఐఎం అధినేత కీలక వ్యాఖ్యలు

-

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ తరపున ఈరోజు ఓవైసీ ఎర్రగడ్డలో పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరాపున 52 సీట్లు గెలుస్తామని అన్నారు. అలాగే ప్రజల మద్దతు ఎంఐఎం పార్టీకి ఉందని ఆయన అన్నారు.

బిజెపి పార్టీ  చేస్తున్న రాజకీయం సరైంది కాదన్న ఆయన గతంలో 44 జీహెచ్ఎంసీ స్థానాలు గెలుచుకున్నాం కానీ ఈ సారి 52 స్థానాలు కైవసం చేసుకుంటామని అన్నారు. ప్రచారం జరుగుతున్నట్టు టిఆర్ఎస్ పార్టీతో మాకు ఎలాంటి పొత్తు లేదని ఆయన అన్నారు. ఆయా డివిజన్లలో ఎంఐఎం పార్టీ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని అన్నారు. బిజెపి పార్టీ హిందుత్వాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దుతుందని అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లిం లకు లేదా? అని ఒవైసీ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news