ఇది చట్ట సభా… ? లేక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా…?- బట్టి విక్రమార్క

-

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. కనీసం మావైపు చూడటం లేదని.. మాకు మైక్ ఇవ్వకుండా.. మమ్మల్ని గుర్తించడం లేదని సీఎల్పీ బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సభలో సభాపతి కనీస మర్యాద పాటించడం లేదని ఆయన అన్నారు. నేను తప్ప ఈ సభలో ఎవరూ ఉండకూడదని అనుకుంటున్నారా…? ఇది చట్ట సభనా.?? లేదా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా.. కేవలం వాళ్ల రాజకీయ పార్టీ కార్యాలయంలాగా… వారికి మద్దతు ఇచ్చే వారిని కూర్చోబెట్టుకుంటున్నారని విమర్శించారు బట్టి. బీజేపీ వాళ్లను సస్పెండ్ చేశారని.. మాకు మైక్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇది సభ నడిపే ప్రక్రియ కాదని అన్నారు. మీరు సొంతగా మీ ఇష్టం వచ్చినట్లు సభ నడుపుకోవాలనుకుంటూ.. సభలో ఉన్న సభ్యుల్ని అవమానపరుస్తున్నారని.. సభా నియమాలను పట్టించుకోవడం లేదని బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓ బొమ్మలా… ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్ లో ఆయన ప్రవర్తిస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణకు రాజు అని అనుకుంటున్నాడని… రాజ్యాంగంపై ఆయనకు గౌరవం లేదని తెలుస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news