ఆసియా లీడర్స్ సమావేశానికి రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి రావాలని పిలుపొచ్చింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా లీడర్స్‌ సిరీస్‌ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది. ఈ భేటీలో ఆసియా, యూరప్ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఆహ్వానం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఆసియా, యూరప్ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడం మా లక్ష్యం అని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news