ఎన్టీఆర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. కోర్టు కీలక తీర్పు

-

ఆడపిల్లలకే కాదు మగ పిల్లలకు కూడా రక్షణ కరువైంది. బాలుర పైన లైంగిక దాడులు జరుగుతున్నాయి. కామాందులు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. మైనర్ బాలుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లికి చెందిన తిరుపతిరావు (32) గత సంవత్సరం స్థానికంగా నివసించే (5) సంవత్సరాల బాలుడిని ఓ భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హింసించాడు.

అక్కడినుండి బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి రాగా తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో నేరం రుజువైన నేపథ్యంలో చిన్నారిపై పశువులా వ్యవహరించిన వ్యక్తికి జీవితకాల జైలు.. రూ 10 వేలు జరిమానాను బుధవారం విజయవాడ ఫోక్సో కోర్టు విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version