మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఏసీ బృందం ఈ మూడు రాష్ట్రాలలో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. నాగాలాండ్, మేఘాలయ లో ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 2న మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news