హరితహారంపై సీఎం సంచలన నిర్ణయం.. ఇక వారి జీతాల నుంచి కోత..

-

తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడానికి హరితహారానికి ప్రభుత్వ నిధులతో పాటు మరింత నిధులను సమీకరించడానికి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. దీని కోసమే హరిత నిధి పేరుతో ప్రత్యేక నిధులను సేకరించే ప్రణాళికను రూపోందించింది. దీనికి గానూ ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హరిత నిధి ప్రణాళికను సభ ముందుంచారు. ఎమ్మెల్యేలు మొదలుకుని ఉద్యోగుల దాకా ప్రతీనెల జీతం నుంచి కొంత నిధిని సేకరించాలని ఆలోచన చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి ప్రతీ నెల రూ. 500, ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల నుంచి నెల రూ. 100, ఇతర ఉద్యోగుల నుంచి రూ. 25 చొప్పున అందరి అనుమతితో నిధులను సమీకరించేలాా ప్రణాళిక రూపొందించారు. ఇదే కాకుండా బార్లు, వైన్స్, ఫెర్టిలైజర్ షాపులు,

kcr

ఇతర వ్యాపార లైసెన్సుల రీన్యువల్ టైంలో ఏడాదికి రూ. 1000 చొప్పున వసూలు చేసేలా నిబంధన తీసుకురానున్నారు. అలాగే భూముల కొనుగోలు రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 50చొప్పున హరిత నిధిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. హరిత హారంలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండే అడ్మిషన్ సమయంలో ఎంతో కొంత హరిత నిధిని వసూలు చేయాలని ఆలోచన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news