చంద్రబాబును తీవ్రవాదిలా రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టారు : అచ్చెన్నాయుడు

-

విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు.. నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి గంటా.. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు తీవ్రవాదిల రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టారన్నారు. స్కిల్ స్కాంలో ఒక్క రూపాయి, ఎవరికైనా వెళ్ళినట్టు, చూపించలేకపోయారని, ఈ అరెస్టు వెనక, కుట్ర ఉంది.. ఆయనకి ప్రాణహాని ఉందని ముందు నుండి చెబుతున్నామన్నారు.

జనస్పందన లేదు, సమీకరించండి - అచ్చెన్న ఆడియో వైరల్..!! | AP TDP Chief  Atchannaidu teleconference with party leaders on cadre mobilisation Audio  goes viral - Telugu Oneindia

అంతేకాకుండా..’నిన్న ఏసీ పెట్టమని కోర్టు చెప్పిన ఈరోజు, సాయంత్రం వరకు కూడా పెట్టలేదు.. ఆయన ఆరోగ్యం పై, అందరిలో ఆందోళన ఉంది.. ఆయనకు ఎయిమ్స్ లో లేదా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలి.. 72 నుండి 66 తగ్గారంటే ఆ రిపోర్ట్ ఇవ్వడం లేదు.. చంద్రబాబుకి ఏదైనా జరిగితే దానికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి .. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.. పోలీసులు నిర్బంధ కాండను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు.. చంద్రబాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత జగన్దే.. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగినంపే సమయం దగ్గరలోనే ఉంది.. చంద్రబాబు ఆదేశాలతోనే, ఎలాంటి హింసకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాo.. రేపు సీఎం వస్తున్నారంటే, ఇప్పటినుండి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తామంటున్నారు.. చంద్రబాబు నాయుడు బయటకొచ్చినంతవరకు ఈ నిరసనలు కొనసాగుతాయి..’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news