పటాన్ చెరువు లో దారుణం.. అప్పు తిరిగి చెల్లించమన్నందుకు యువకుడిని హతమార్చిన దుండగులు

-

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు మహ్మద్ సమీర్ అహ్మద్(28) అనే యువకుడిని హతమార్చారు దుండగులు. గత కొంతకాలం క్రితం ఇస్మాయిల్ అనే వ్యక్తి కి 50 వేలు అప్పు ఇప్పించాడు మహ్మద్ సమీర్ అహ్మద్. అప్పుతిరిగి ఇవ్వకపోవడం తో వడ్డీతో సహా అప్పు ఇవ్వాలని ఇస్మాయిల్ ను అడిగాడు మహ్మద్ సమీర్ అహ్మద్. అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడని హతమార్చేందుకు ప్రణాళిక వేసాడు ఇస్మాయిల్.

అనాద శవం వస్తోందని నమ్మించి పటాన్ చెరు శివారు ఈద్గాలో గుంత తవ్వించాడు ఇస్మాయిల్. ఈనెల 9 వతేదీన పెయింటింగ్ పని ఉందని మహ్మద్ సమీర్ అహ్మద్ ను పిలిపించి హతమార్చాడు ఇస్మాయిల్. ఎవ్వరికీ అనుమానం రాకుండా అనాథ శవంలా పటాన్ చెరు శివారు ఈద్గాలో పూడ్చిపెట్టాడు. ప్రధాన నిందితుడు ఇస్మాయిల్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహ్మద్ సమీర్ అహ్మద్ మృతదేహాన్ని తవ్వి తీసి తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news