శంషాబాద్ లో దారుణం.. భార్య గొంతు కోసి చంపిన భర్త

-

పలు సందర్భాల్లో భార్యాభర్తలు గొడవ పడడం సర్వసాధారణం. కానీ ఇక్కడ జరిగిన గొడవ మాత్రం ఏకంగా చంపుకునే స్థాయికి చేరింది. శంషాబాద్ లో భార్యని అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ యాదవ బస్తీలో ధనమ్మ అనే మహిళ గొంతు కోసి హత్య చేశాడు భర్త పెద్దులు. ధనమ్మ కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది.

భర్త పెద్దులు అడ్డా కూలి. అయితే గత రాత్రి వీరిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న భర్త పెద్దులు భార్యను కత్తితో మెడ కోసి హత్య చేశాడు. విజయం తెలుసుకున్న శంషాబాద్ ఏసీపి భాస్కర్, సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియాలసి ఉందని అన్నారు శంషాబాద్ ఏసిపి భాస్కర్.

Read more RELATED
Recommended to you

Latest news