నటుడు నరేశ్ నివాసంపై దాడి… పోలీసులకు ఫిర్యాదు

-

హైదరాబాదులో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నివాసంపై దాడి జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారని నరేశ్ ఆరోపించారు. గత రాత్రి కారును ధ్వంసం చేశారని తెలిపారు. తన భార్య రమ్య రఘుపతి ఈ దాడి వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. కాగా, నరేశ్ ఇటీవల నటి పవిత్రా లోకేశ్ తో తన అనుబంధాన్ని బహిరంగంగా వెల్లడించడం తెలిసిందే. దాంతో ఆయన భార్య రమ్య రఘుపతి భగ్గుమంటున్నారు. నరేశ్, పవిత్ర లోకేశ్ మైసూరులో ఓ హోటల్ లో ఉండగా… రమ్య రఘుపతి చెప్పుతో కొట్టబోవడం సంచలనం సృష్టించింది. ఆస్తి కోసంతన మూడో భార్య చంపాలని చూస్తుందని నరేశ్ ఇటీవల ఆరోపించారు. ఇందుకోసం ఒక గ్యాంగ్‌ను కూడా పెట్టుకుందని.. వాళ్లు తనను ఫాలో అవుతున్నట్లు నరేశ్ అన్నారు.

“నా మూడో భార్య రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను చంపి నా ఆస్తి కాజేయాలని చూస్తుంది. ఇందుకోసం ఒక ముఠాను కూడా రమ్య కలిసింది. ఇందుకోసం ఆమెకు ఓ రాజకీయ నాయకుడు, ఒక పోలీసు అధికారి కూడా సాయం చేస్తున్నారు. నా డబ్బు కోసమే ఆమె ఇలా చేస్తోంది. నాకు పోలీసులు రక్షణ కల్పించాలి. పెళ్లయిన నాటి నుంచి తను నన్ను మానసికంగా వేధిస్తోంది. ఇప్పటికే తన నుంచి విడాకులు మంజూరు చేయాలని కోర్టులో డైవర్స్ పిటిషన్ వేశాను.”

Read more RELATED
Recommended to you

Latest news