ఆస్తి కోసం తండ్రిపై గొడ్డలితో దాడి

-

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కుర్లపల్లి లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రి పైనే ఒక కుమారుడు, కుమార్తె హత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ పేరిట ఉన్న ఆస్తి రాసి ఇవ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణ స్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె శనివారం అడిగారు. ఆస్తి పంచడానికి తండ్రి నారాయణ స్వామి నిరాకరించాడు.

దీంతో ఆయన కళ్లలో కారం కొట్టి గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి స్థానికుల సహాయంతో అదేరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి జైలుకు తరలించారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news