వీడియో: ఇదెక్కడి మాస్ ఫైట్ రా మామా.. లైవ్ మ్యాచ్‌లో కొట్టుకున్న ప్రేక్షకులు

-

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భారత్ ఓటమి చవి చూసింది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమికి గురైంది. ప్రస్తుతం రిషబ్ పంత్ అధ్యక్షతన టీమిండియా తదుపరి మ్యాచ్‌కు రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మ్యాచ్-గొడవ
మ్యాచ్-గొడవ

ఈస్ట్ స్టాండ్స్ లో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన కొందరు ప్రేక్షకులు విపరీతంగా గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని గొడవను శాంతింపజేశారు. పండింత్ జోఫ్రా ఆర్చర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. కాగా, రేపు కటక్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిస్తేనే మ్యాచ్ గెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news