వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కు ఏమైంది ప్రెస్ మీట్ లో ఇలా చేశాడు

-

మీడియా సమావేశంలో పత్రిక విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత ఆషామాషీ విషయం కాదు. విలేకరులు ఎంత కఠినమైన ప్రశ్న సాధించినా ఓర్పుగా సమాధానం చెప్పగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.. కొన్ని కొన్ని సార్లు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు.. అనుకోని ఘటనలు ఎదురైనా సమయ స్ఫూర్తితో ముందుకు వెళ్తుంటారు నేతలు.. అయితే.. వైసీపీ కీల‌క నేత‌, ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఓ మీడియా ప్ర‌తినిధిని బెదిరించిన ఘ‌ట‌న సోమ‌వారం చోటుచేసుకుంది.

నీ సంగతి చూస్తానంటూ వేలు చూపించి మ‌రీ ఆయ‌న మీడియా ప్ర‌తినిధిని బెదిరించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే… భీమిలి ప‌రిధిలోని ప‌ద్మ‌నాభం మండ‌లం కోరాడ‌లో సోమ‌వారం రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హాజ‌రైన అవంతి… మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు పోలీసు సిబ్బందిపైనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని ప‌ట్టుకుని ఏం ప‌ని చేస్తున్నావ‌య్యా అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఆ త‌ర్వాత కార్యక్ర‌మాన్ని క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చిన ఓ మీడియా ప్ర‌తినిధిని బెదిరించారు అవంతి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news