BREAKING : సీఎం జగన్ వెంటే ఢిల్లీలో అవినాష్ రెడ్డి !

-

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వెంటే ఢిల్లీలో అవినాష్ రెడ్డి ఉన్నారని సమాచారం అందుతోంది. నిన్న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌ వెళ్లారు. అయితే, నిన్నటి నుండి సీఎం జగన్ వెంటే అవినాష్ రెడ్డి ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది. నిన్న రాత్రి కూడా జగన్ నివాసంలో ఆయనతోపాటు బస చేశారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.

ఇక ఈ రోజు ఉదయం నుండి ముహాభావంగా అవినాష్ రెడ్డి ఉన్నారు. పూర్తి నిరాశ నిస్పృహలో అవినాష్ రెడ్డి ఉన్నారని సమాచారం అందుతోంది. ఢిల్లీలోని జగన్ నివాసంలోఎంపీలు పార్టీ నేతలు సహా ఎవరితోనూ అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు అవినాష్ రెడ్డి. తమ సహచర ఎంపీలకు దూర దూరంగా ఉంటున్నారు అవినాష్ రెడ్డి. జగన్ మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్ప మిగిలిన ఎంపీలు ఎవరితోనూ మాట్లాడటం లేదు అవినాష్ రెడ్డి. ఇక దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news