రాజమౌళి నుంచి ఆయన తండ్రిని దూరం చేస్తానంటున్న డైరెక్టర్..ఎవరో తెలుసా?

-

దేశం గర్వించే దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. తెరకెక్కించిన RRR సినిమా చూసి జనం ఫిదా అయిపోయారు. ఆయన తీసిన ప్రతీ సినిమాకు దాదాపుగా ఆయన తండ్రి విజయేంద్రప్రాసాదే స్టోరి అందించారు. కాగా, తాజాగా ఓ దర్శకుడు రాజమౌళి నుంచి ఆయన తండ్రిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. ఆయన ఎవరంటే..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహాస్త్ర’ ఫిల్మ్ ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి ప్రజెంట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి, రణ్ బీర్, ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ..వైజాగ్ వచ్చారు.

Rajamouli Father Writer Vijayendra Prasad Tested Positive for Covid 19

ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీని రాజమౌళి పలు ప్రశ్నలు వేయగా ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు. ‘బ్రహాస్త్ర’ చిత్రాన్ని తనకెందుకు చూపించలేదని అడిగాడు దర్శకధీరుడు. ఈ క్రమంలోనే తనకు కాకుండా తన తండ్రి విజయేంద్రప్రసాద్ కు మాత్రమే ఎందుకు చూపించారని ప్రశ్నించాడు.

అయాన్ మాట్లాడుతూ..విజయేంద్రప్రసాద్ కు చూపించడానికి ప్రధాన కారణం ఆయన్ను రాజమౌళి నుంచి దూరం చేయడమేనని ఫన్నీ వేలో ఆన్సర్ ఇచ్చాడు. అయాన్ చెప్పిన సమాధానం విని ఆడియన్స్‌తో పాటు రాజమౌళి కూడా నవ్వేశారు. అనంతరం మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్ లాంటి వారి సూచనలు, సలహాల కోసం చూయించినట్లు చెప్పిన అయాన్..త్వరలో రాజమౌళికి చూపిస్తానని ప్రామిస్ చేశారు.

మధ్యలో రణ్ బీర్ కపూర్ కల్పించుకుని మాట్లాడుతూ..విజయేంద్రప్రసాద్ సూచనలతో మరో నాలుగు రోజులు సినిమాను రీ షూట్ చేసినట్లు తెలిపారు. అది విజయేంద్రప్రసాద్ కు దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇచ్చిన విలువ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news