మరో మూడునెలల్లో ..బాబు బ్యాక్ టు హోం… తలసాని…

-

ఏపీకి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని మాజీ మంత్రి తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన తలసాని చంద్రబాబు పై కీలక విమర్శలు చేశారు. మరో మూడు నెలల్లో బాబు బ్యాక్ టు హోం అంటూ విమర్శించారు. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అనే వైఖరి చంద్రబాబుకు మాత్రమే చెల్లుంతోంది… తాను లేకపోతే ఏపీని ఎవరూ బాగుచేయలేరని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ నేత కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలని సూచించారు. తెదేపా లేకపోతే అసలు ఏపీలో ప్రజల పరిస్థితి ఎమవుతుందో అనే భావన కల్పిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

నాలుగేళ్లు మోడీతో సంసారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చేప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లు కాదా అని ప్రశ్నించారు. త్వరలోనే తెరాస అధినేత కేసీఆర్ ఏపీలోనూ పర్యటిస్తారు… తెదేపాకి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news