వైఎస్ జగన్ వీరాభిమానికి భారీగా జరిమానా

-

కర్ణాటక: వైఎస్ జగన్ వీరాభిమానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. వాహన తనిఖీల్లో ఆయన కారుకు భారీగా జరిమానా విధించారు. కేఆర్‌పురలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీ39 – జేజీ 451 నంబరు గల కారును ఆపారు. అయితే కారు నెంబర్ సరిగాలేదు. తీరా చేస్తే 451 నంబరును వైఎస్‌జే వచ్చేలా రాసి ఉంది. దీంతో అవాక్కైన పోలీసులు సదరు కారు ఓనర్‌కు జరిమానా విధించారు.

అంతేకాదు కారు నెంబర్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. మోటారు వాహనాల చట్ట నిబంధనల కింద నేరమని సూచించిన అధికారులు వెంటనే నంబరు ప్లేట్‌ను మార్చాలని జరిమానా విధించినట్లు కేఆర్‌పుర ట్రాఫిక్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఎంఎ మహమ్మద్‌ తెలిపారు. కారు యజమాని వైఎస్‌ జగన్‌కు అభిమానిగా గుర్తించారు. ఎవరైనా సరే కారు నెంబర్ సరిగాలేకపోతే జరిమానా తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని వెల్లడించారు. అలా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీప్పవని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news