బాలకృష్ణ ఒక సైకో.. పోసాని సంచలన కామెంట్స్..!

-

నందమూరి బాలకృష్ణకు ఆవేశం ఎక్కువ.. నోటి దురుసు ఎక్కువ.. మాటిమాటికి పక్కనున్న వారిపై చేయి చేసుకుంటాడు అంటూ ఇలాంటి వార్తలు ఎప్పుడూ బయటకు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని మాట్లాడుతూ.. బాలకృష్ణ ఒక ఇద్దరినీ తుపాకీతో కాల్చాడు.. మంచి వాళ్ళు ఎవరైనా అలా కాలుస్తారా? సైకోలు మాత్రమే మనుషుల్ని చంపుతారు… మనకు చట్టం, న్యాయం అనేవి ఉన్నాయి.. బాలకృష్ణకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కు వెళ్లవచ్చు.. వాళ్ల మీద కేసులు పెట్టవచ్చు.

తనదే అధికారం అన్నట్టు చేతిలో గన్ ఉంది కదా అని కాల్చేశాడు. కాల్చిన తర్వాత ఒక రోజైనా జైల్లో ఉన్నాడా అంటే అదీ లేదు.. ఒకవేళ నేను ఇద్దరిని కాల్చితే పోసాని అమాయకుడని వదిలేస్తారా? లేదు కదా.. కొట్టి జైల్లో వేస్తారు.. మరి నువ్వు ఇద్దరిని కాల్చావు.. నిన్నెవరు ఏం చేయలేకపోయారు? ఎవరు మానసిక రోగి? ఎవరు క్రూరుడు? అనేది తెలిసిపోతుంది. మీ ఇంట్లో ఒకరోజు రాత్రి కళ్ళముందే వాచ్మెన్ చనిపోయాడు. కానీ పొద్దున్నే డెడ్ బాడీని దాటుకుంటూ షూటింగ్ కి వెళ్ళిపోయావు ఎవరైనా అడిగారా.. నువ్వు ఒక సైకో అనడానికి ఇక్కడే అర్థమవుతుంది.

చెప్పుకుంటూ పోతే నీ గురించి లెక్కలేనన్ని సంఘటనలు బయటపెడతాను అంటూ పోసాని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇది విన్న చాలా మంది బాలయ్య మంచి మనసున్న వ్యక్తి.. ఆయనను అనడం సమంజసం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news