ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద బాలకృష్ణ నివాళులు

-

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు బిడ్డగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు బాలకృష్ణ అన్నారు.

‘‘ప్రజల భవితకు భరోసా ఇచ్చిన అమ్మ.. ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన అన్న.. నందమూరి తారకరామావు. అటువంటి మహానుభావుడిని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ఎన్టీఆర్‌కే సాధ్యం అయింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన గొప్ప ఆస్తి. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ. టీడీపీని ప్రతి కార్యకర్త ముందుకు నడిపి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ’’ అని బాలకృష్ణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news