“పుష్ప” సినిమాకు ఫ్యామిలీతో వచ్చిన బాలయ్య..వీడియో వైరల్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా సినిమా.. పుష్ప. ఈ సినిమాను టాలీవుడ్ సంచలన దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా… అల్లు అర్జున్ సరసన యంగ్ బ్యూటీ.. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం థియేటర్లలో బంపర్ కలెక్షన్స్ తో .. ముందుకు సాగుతోంది పుష్ప సినిమా.

అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాలు చూశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ స్క్రీన్ ను వేయించారు. అయితే బాలకృష్ణతో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలయ్య సతీమణి వసుంధర, మోక్షజ్ఞ, చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త కూడా పుష్పక విమానం ఎక్కించారు. అనంతరం పుష్ప నిర్మాతల్లో ఒకరైన నిర్నేని నవీన్ తో కలిసి ముచ్చటించారు బాలయ్య. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news