బాలకృష్ణ ఎప్పటికీ ఆ స్థాయికి చేరుకోలేడు.. గీతాకృష్ణ..!

-

ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఇటీవల సినిమాలలో అవకాశాలు లేక తరచూ ఇంటర్వ్యూలు చేస్తూ ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ఈయన చేసే కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే చిరంజీవి మట్టిలో పుట్టిన మాణిక్యం అని బాలకృష్ణ ఎప్పటికీ ఆ స్థాయికి చేరుకోలేడు అని సంచలన కామెంట్లు చేశారు.

ఈ క్రమంలోని తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను, విశ్లేషణలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.. ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు సమాధానం అడగగా.. విస్తపోయే సమాధానం చెప్పి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడంతో ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడుగుతున్నారని .. అసలు ఇదేం ప్రశ్న అంటూ ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత తన నిర్ణయం చెబుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎవరు గొప్ప ఏంట్రా స్టుపిడ్ ఫెలో.. చిరంజీవి ఇప్పటికే తాను ఏంటో నిరూపించుకున్న నటుడు.. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం.. ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని వచ్చినోడు బాలకృష్ణ.. చిరంజీవి స్థాయికి బాలకృష్ణ ఎప్పటికీ చేరుకోలేడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ఈ మధ్యన జై బాలయ్య అనే మూమెంట్ ఎందుకు వచ్చింది.. వాడెవడో డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి.. కాబట్టి దాని తర్వాత అందరూ కలిసి కాలరెగరేస్తున్నారు. నేను ఫ్యాన్స్ కి చెప్పట్లేదు. జనరల్గా చెబుతున్నాను.. చిరంజీవిని ఎవరు బీట్ చేయలేరు.. బాలకృష్ణ కు కొంతకాలం నడుస్తుంది.. అతను సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వలేదని.. వాడెవడో ప్రొడ్యూసర్ ఆత్మహత్య చేసుకోబోయాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గీతాకృష్ణ. అంతేకాదు ఆహా వాళ్లు తమకు మైలేజ్ వస్తుందని అంచనా వేసుకొని బాలకృష్ణను పిలిచారు అని , అది వర్కౌట్ అయింది..టైం బాగుంటే అంతా బాగా జరుగుతుందని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news