మైత్రి మూవీ మేకర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఏమైందంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో గాంభీర్యంతో ప్రేక్షకులను అలరించే బాలయ్య బాబు.. ప్రస్తుతం ఆరుపదుల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేతిలో రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న #NBK 107 కాగా , మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు కావడం గమనార్హం. ఇకపోతే ఈ రెండు సినిమా షూటింగ్ లు కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ రెండు సినిమాల్లో కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే రెండు సినిమాలు ఒకేసారి విడుదలయితే లాభంలో షేర్ తగ్గిపోతుందని మైత్రి మూవీ మేకర్స్ వారు బాలకృష్ణ సినిమాలు డిసెంబర్ లోనే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణను తేదీ మార్చుకోమని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ దీనికి బాలయ్య ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. నిజానికి ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ ప్రభంజనం సృష్టించాడు. అందుకే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలకృష్ణ తన తదుపరి సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి సందర్భంగా నే విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

మరి ఈ రెండు సినిమాలలో ఎవరు తమ సినిమాను ముందే లేదా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version