రేప్, హత్య, కబ్జా కేసుల్లో టీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారు : బండి సంజయ్ సంచలనం

-

హత్య కేసును మహిళకు ముడిపెట్టడం బాధాకరం అని.. కొంతమంది ఐపీఎస్ లు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ… తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ఆరోపణలు హాస్యాస్పదం అని ఆయన కొట్టిపారేశారు. మా ఇద్దరు నాయకులుపై పరువు తీసేలా చేస్తున్నారంటూ… వ్యాఖ్యానించారు. రేప్ కేసులు, కబ్జా కేసులు, అమ్మాయిల కేసులు, అవినీతి కేసులు, హత్యా రాజకీయాల్లో అన్నింటిలో కూడా టీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారని ఆరోపించారు. 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన టీఆర్ఎస్ నాయకుడిని పట్టుకోవడం పోలీసులకు చేతకాలేదని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ఢిల్లీకి పోయి కనీసం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా.. ఇంటిపై దాడిచేసి అక్కడి వ్యక్తులను పట్టుకువచ్చి.. నేపాల్ వ్యక్తిని కూడా పట్టుకోచ్చారని.. పోలీస్ అధికారులు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. కొంతమంది పోలీస్ అధికారులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని.. బరి తెగించి ఉన్నారని విమర్శించారు. కొందరు ఐపీఎస్లు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని అన్నారు. పోలీసులు పనితీరు చూసి ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. నటనలో పోలీసులు జీవిస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి బండారం బయటపడుతుందనే.. కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news