టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా.. పోతుందా… గ్యారెంటీ లేదు- బండి సంజయ్

-

కేసీఆర్ ఢిల్లీ పర్యటన, టీఆర్ఎస్ పార్టీ వైఖరిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ పై సంచనల వ్యాఖ్యలు చేశారు  బండి సంజయ్. కేసీఆర్ రాజకీయ పతనం ప్రారంభమైందని అన్నారు. ఆయన జ్యోతిష్యుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా.. పోతుందా.. గ్యారెంటీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాని బద్నాం చేసేందుకు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. బీజేపీపై నెపం నెట్టడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. అసలు అపాయింట్మెంట్ లేకుండా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తన సొంత పనుల కోసమే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని అన్నారు. పియూష్ గోయల్ అపాయింట్మెంట్ లేకుండానే తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు.

టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కష్టపడుతున్నారని అన్నారు బండి సంజయ్. ఏడేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులను ఏనాడు ఆదుకోలేదని అన్నారు. రైతుల గురించి ఆలోచించే పార్టీ బీజేపీనే అని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. 7 ఏళ్లుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయలేదని.. 3 ఏళ్లుగా అసలు నోటిఫికేషన్ విడుదల చేయలేదని, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారని.. వీటన్నింటికి ప్రభుత్వమే కారణం అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news