కేసీఆర్ అమరవీరులను అవమానిస్తున్నారు : బండి సంజయ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులను ఘోరంగా అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోవడం అమరవీరులకు సరైన గౌరవం ఇవ్వకపోవడమేనని అన్నారు. అధికారంలోకి రాకముందు ఓ మాట చెప్పి.. ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయం వెనుక అసలు కారణమేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు.

అధికారంలోకి రాకముందు సెప్టెంబర్‌ 17న అధికారికంగా చేస్తామని హామీ ఇచ్చిన సీఎం… వెనక్కి తగ్గడం దుర్మార్గమని బండి విమర్శించారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జిమ్మిక్కు ప్లాన్‌ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ నిఖార్సైన తెలంగాణవాదైతే గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రతి ఏటా సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news