కార్పొరేటర్లను వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్‌

-

బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తుంటే తమ పార్టీ కార్పోరేటర్లను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు బండి సంజయ్. జీహెచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రజా సమస్యలపై గొంతెత్తిన బీజేపీ కార్పోరేటర్లను మార్షల్స్‌ను ద్వారా గెంటించివేసి బడ్జెట్‌ను ఆమోదించుకోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్.

Telangana BJP chief Bandi Sanjay Kumar held over protest against arrest of  workers - India Today

తక్షణం అరెస్టు చేసిన బీజేపీ కార్పోరేటర్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఉప్పల్ లో మేయర్ ను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. బీజేపీ ఆందోళన చేపట్టింది. కార్పొరేటర్లపై ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారంటూ మేయర్ పోడియాన్ని బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news