ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ ఘాటు లేఖ

-

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఘాటుగా లేఖ రాశారు. బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల న్యాయమైన సమస్యలపై ‘‘నిరోచక్రవర్తి’’ గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. బాసర ట్రిపుల్‌ విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే ఆమోదించి వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

జాతీయపార్టీ ఏర్పాటుపై, పొలిటికల్‌ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి మీకు సమయం ఉంటుంది, కానీ గత 6 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం కేసీఆర్‌కు సమయం చిక్కదని.. కేటీఆర్‌ విదేశీ పర్యటనకు, కేసీఆర్‌ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారు గానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మాత్రం నిధులుండవని వెల్లడించారు.

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి బేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలని.. మంత్రులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు. బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news