కేటీఆర్, సంతోష్ రావుల మధ్య సిఎం పోస్ట్ పంచాయితీ !

-

తెలంగాణా వరదలకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం – బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పీఠం కోసం కేటీఆర్, సంతోష్ రావుల మధ్య పంచాయితీ నడుస్తోందని అన్నారు. కంటోన్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందమమ ఆయన కంటోన్మెంట్ కు వచ్చే నిధులన్నీ కేంద్రానివేనని అన్నారు. కేంద్ర నిధులపై నేను విసిరిన సవాల్ కి సీఎం కేసీఆర్ తో చర్చకు సిద్ధమా ? అని ప్రశ్నించారు.

అలానే రాష్ట్ర మంత్రులకు అహంకారం నెత్తికి ఎక్కిందని, కేసీఆర్ క్యాబినెట్ లో తాగుబోతులు, తిగురుబోతులున్నారని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం‌ ప్రదర్శిస్తోందన్న ఆయన బీజేపీ ఎక్కడుందో కవిత, బోయినపల్లి వినోద్ ను అడిగితే తెలుస్తోందని అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న ఆయన హిందువుల దేవుళ్ళను అవమాన పర్చిన ఎంఐఎంతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నాడని అన్నారు. 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడని, ఇక కేసీఆర్ పై మలిదశ ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news