ఢిల్లీకి వెళితే..కేసీఆర్ ను రాళ్లతో కొడతారు : బండి సంజయ్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు ఇవాళ బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. నిన్న సీఎం కేసీఆర్ గంటపాటు మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలేనని.. కేంద్ర ప్రభుత్వం పై అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు పై సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని నిప్పులు చెరిగారు.

కేంద్రంపై పోరాటానికి ఢిల్లీ వెళ్తామన్న సీఎం కేసీఆర్ ను… అక్కడి రైతులు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. హుజురాబాద్ ఓటమి ఆ వేదన లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చురకలంటించారు.
ఒక పెద్దాయన వచ్చి తెలంగాణ భవన్ ని చూసి ఇయన్ని మెచ్చుకున్నాడు అట… ఇప్పుడు ఆయనకు చూపెట్టాలి సచివాలయం ని కూల కొట్టి ఫార్మ్ హౌస్ లో పడుకుంటుండని కెసిఆర్ కు చురకలు అంటించారు.

తాగుతా.. తగిపిస్తా అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు… మందు తాగి బండి నడిపితే తప్పు అయితే.. మందు తాగి రాష్ట్రాన్ని నడపడం తప్పు కాదా ? అని ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రాన్ని మొదట మోసం చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయం లో 299 టీఎంసీ లకు ఒప్పుకుని సంతకం చేసింది నువ్వు కాదా ? అని నిలదీశారు. కోర్ట్ లో కేసు విత్ డ్రా చేసుకున్నది మొన్న.. మరి రాయలసీమ ను రతనాల సీమ చేస్తా అనలేదా.. చేప పులుసు తిని రాలేదా ? అని ప్రశ్నించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news