కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు – రేవంత్ రెడ్డి

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో డి శ్రీనివాస్ చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. డి ఎస్ చేరిక అధిష్టానం పరిధిలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పటికే రెండు సార్లు సోనియాను కలిశారని.. కొత్త చేరికలు త్వరలో ఉంటాయని తెలిపారు. నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు అపొద్దు అని రాహుల్ గాంధీ చెప్పారని వివరించారు రేవంత్ రెడ్డి.

పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేర్చుకుంటాం అన్నారు. ఉత్తర తెలంగాణ పై ఫోకస్ పెట్టామని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇక బట్టి యాత్ర ఏఐసీసి కార్యక్రమం అని.. తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు రేవంత్ రెడ్డి. బిజెపి, టిఆర్ఎస్ వ్యూహత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news