రేవంత్ ఎఫెక్ట్.. పాదయాత్రకు సిద్ధమవుతోన్న బండి సంజయ్

-

హైదరాబాద్: తెలంగాణలో రాజీయం రంజుగా మారుతోంది. రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ప్రకటించడంతో మిగిలిన పార్టీలు కూడా అలెర్ట్ అయ్యాయి. టీపీసీసీ ఇస్తే పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టంతో మిగిలిన పార్టీలు నేతలు కూడా జనం పట్టాలని భావిస్తున్నారు.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జులై చివరి వారంలో పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. పాదయాత్రకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ముగింపు హుజురాబాద్‌లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

 

అయితే గతంలోనే బండి సంజయ్ పాదయాత్ర చేయాలని భావించారు. అయితే కోవిడ్, జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికలు వరుసగా రావడంతో ఆయన వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే అంశంపై స్పష్టలేకపోయినప్పటికీ ముగింపు మాత్రం హుజురాబాద్‌లో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news