తెలంగాణ మంత్రులంతా నాస్తికులే.. కేటీఆర్ ఓ మూర్ఖుడు : బండి సంజయ్ సంచలనం

-

స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీను తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి ఆహ్వానించడంపై బిజేపి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గమ్మ వారిని, సీతమ్మ వారిని, శ్రీరామ చంద్రుడ్ని అవమానించిన మూర్ఖుడు స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణమని అగ్రహించారు. రాష్ట్రాన్ని ఏలుతున్న భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్ తొలుత నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలని… కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులేనని నిప్పులు చెరిగారు.

మంత్రి కేటీఆర్ ఓ మూర్ఖుడు అని ఫైర్ అయ్యారు. మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని… యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపైనా ఉందన్నారు. ఒకప్పుడు విదేశీ ప్రతినిధులకు తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. కానీ నేడు విదేశీ ప్రతినిధులకు భగవద్గీత, శ్రీరాముడి ప్రతిమలను అందిస్తూ కొత్త ఒరవడిని స్రుష్టించిన నేత నరేంద్ర మోదీ అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news