బోరున ఏడ్చేసిన చంద్రబాబు : బండ్ల గణేష్ సంచలన ట్వీట్ !

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు…. అసెంబ్లీ హాల్ లో జరిగిన తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో… వైసిపి తీరుపై కంటతడి పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా.. తాను మరోసారి ఏపీ ముఖ్యమంత్రి అయిన అనంతరం అసెంబ్లీ కి వస్తానని… శపథం చేసి టిడిపి ఆఫీస్ కు వచ్చారు. టిడిపి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా.. మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్నారు. మాట్లాడుకుంటూనే ఒక్కసారిగా ఏడ్చేశారు చంద్రబాబు నాయుడు. దీంతో.. అక్కడి రిపోర్టర్ ల తో పాటు టిడిపి నాయకులు కూడా షాక్ కు గురయ్యారు. అయితే చంద్రబాబు మీడియా ముందు ఏడవడం పై టాలీవుడ్ స్టార్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు.

ఆయన ఏడ్చిన వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు బండ్లగణేష్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఏడ్చారు అని పేర్కొన్నారు. ఏపీ పరిస్థితులతో చంద్రబాబునాయుడు టెన్షన్ కు గురయ్యారని తెలిపాడు బండ్ల గణేష్. మీరు ఏడవద్దని.. మీ వెనక అందరూ ఉన్నారని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు బండ్లగణేష్. ఇక బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news