బతుకమ్మ చీరల పంపిణీ  ప్రారంభం : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుక- బతుకమ్మ చీరల పంపిణీ  ప్రారంభం అయినట్లు ప్రకటించారు మంత్రి కె.తారక రామారావు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్నిచర్యలు తీసుకున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన అర్హూలైన ప్రతి ఒక్క అడబిడ్డకు బతుకమ్మ చీర అని.. ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలోని అడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల  జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు.

2017 నుంచి  గత ఎడాదిదాకా మూడు కోట్ల 90 లక్షల చీరలను పంపీణీ చేశామని.. ఈసారి  333.14 కోట్లతో ఒక కోటి 8 లక్షల చీరలు సిద్దం అయినట్లు పేర్కొన్నారు.

ఈ సంవత్సరం  30 సరికొత్త  డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం  810 రకాల  చీరల తయారీ జరిగిందని.. రాష్ర్టంలో పవర్ లూమ్ పరిశ్రమ బలోపేతానికి ఈ కార్యక్రమం నాంది పలికిందన్నారు. గత నాలుగేళ్లలో  నేతన్నల అదాయం, నైపుణ్యం పెరిగిందన్న మంత్రి కేటీఆర్.. రానున్న రోజుల్లో  మరిన్ని డిజైన్లు,  ఇతర వస్త్రాలను  ఉత్పత్తి చేసే దిశగా రాష్ర్టంలోని పవర్ లూమ్ కార్మికులు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news