నాపై కేసు వేసిన వాళ్లకు నరకం చూపిస్తా : బెల్లంకొండ సురేష్

-

చీటింగ్ కేసుపై స్పందించారు టాలీవుడ్‌ నిర్మాత బెల్లంకొండ సురేష్. తనను బ్యాడ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు అని… నా పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారు… శరణ్ పై పరువు నష్టం దావా వేస్తా, లీగల్ గా ఎదుర్కొంటా అంటూ కామెంట్స్ చేశారు. తనపై కేసు వేసిన శరణ్ కు నరకం చూపిస్తానని బెల్లంకొండ సురేష్ వార్నింగ్‌ ఇచ్చారు. రూ. 85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణ వచ్చిందని.. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడని శరణ్‌ పై ఫైర్‌ అయ్యారు..

అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చారని… శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అతని పై పరువు నష్టం దావా వేస్తానని… ఏదన్నా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలని పేర్కొన్నారు. 2018 లో తీసుకున్నానని ఆరోపించాడు.. ఇన్ని రోజులు కనీసం నన్ను కలువలేదని.. లీగల్ గా శరణ్ కు నరకం చూపిస్తాని హెచ్చరించారు. ఇప్పటి వరకు నా పిల్లలు ఎక్కడ ఎవరి జోలికి వెళ్ళలేదు… దేశ వ్యాప్తంగా నా కొడుకు శ్రీనివాస్ కు మంచి ఇమేజ్ ఉందన్నారు.

శ్రీనివాస్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు ఇదంతా చేస్తున్నారని ఆగ్రహించారు. తనకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని.. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారన్నారు. శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతని క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోనన్నారు. బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతానని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news