ప్రేమించిన భార్య అకాల మరణం.. భర్త ఆత్మహత్య!

-

ప్రేమించిన భార్య మరణించింది. దీంతో భార్య మృతదేహం దగ్గరే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన పుట్ట సురేశ్ (28 ఏళ్లు) అదే గ్రామానికి చెందిన నిర్మల అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య నిర్మల అనారోగ్యానికి గురైంది. దీంతో రెండేళ్ల క్రితం మరణించింది. అకాల మరణాన్ని సురేశ్ తట్టుకోలేకపోయాడు. దీంతో భార్య సమాధి వద్ద సురేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్య
ఆత్మహత్య

దీంతో కుటుంబసభ్యులు సురేశ్‌ను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేశ్ మృతి చెందటంతో అతని ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది రకరకాల కారణాలు చెప్పి విడిపోతున్నారు. కానీ కొందరు భార్యభర్తలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. చావులో కూడా ఒకటవుతున్నారు. సురేశ్ మృతితో గ్రామ ప్రజలు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news