వాటే స్కీమ్.. రూ.లక్షకు రూ.2 లక్షలు.. రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు..!

-

పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. ప్రజలకు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఇందులో డబ్బులు పెడితే చాలా రకాల లాభాలని పొందొచ్చు. పైగా దీని వలన రిస్క్ కూడా ఉండదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

Postoffice
Postoffice

పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌ లో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెడితే అవి కచ్చితంగా డబ్బులు రెట్టింపు అయ్యిపోతాయి. ఈ స్కీమ్ లో ఎంతైనా పెట్టచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ పథకం పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలని కూడా పొందొచ్చు.

అయితే ఇందులో డబ్బులు రెట్టింపు అవ్వాలంటే 10 ఏళ్ల 4 నెలలు ఉంచాలి. అప్పుడు మీ డబ్బులు డబుల్ అవుతాయి. అంటే 124 నెలలనమాట. మీరు రూ.1000 నుంచి డబ్బులు ఈ స్కీమ్ లో పెట్టచ్చు. రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి గమనించండి.

ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇందులో చేరచ్చు. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి స్కీమ్ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాలు కలిగిన వారికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news