హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనాలు చేసి తీరుతాం – భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

-

వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం.. హుస్సేన్ సాగర్ లొనే చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయం లో హై కోర్టు తీర్పును స్వాగతుస్తున్నామని చెప్పారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లు ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news