హిందువుల ఓపికను, సహనాన్ని పరీక్షించవద్దు : భజరంగ్ దళ్

-

మొన్న హైదరాబాద్ లో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన బాధితురాలిని సోమాజిగూడ యశోద  హాస్పిటల్ లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు  &  భజరంగ్ దళ్ అధ్యక్షుడు సుభాష్ లు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస పాలనలో హిందూ మహిళలకు రక్షణ లేదని, తెరాస & ఎంఐఎం నాటకం ఆడుతుంటే వాళ్ళ అండదండలతో ముస్లిం యువకులు రెచ్చిపోతున్నారని, లవ్ జిహాదీ పేరుతో కొత్త రకమైన యుద్ధం ప్రకటిస్తున్నారని అన్నారు. హిందూ మహిళలు ఎవరూ ముస్లిం యువకుల చేతిలో మోసపోవద్దన్న ఆయన సమాజంలో తక్కువ శాతం ఉన్న ముస్లింలు ఎక్కువ శాతం ఉన్న హిందువుల పైన దాడి చేయడం ఏంటి ?? ప్రేమ పేరుతో నయవంచన చేస్తున్నారు

విదేశాలకు పంపి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయని అన్నారు. మా హిందువుల ఓపికను, సహనాన్ని పరీక్షించవద్దు… ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే సహించం…ఈ మేరకు ప్రభుత్వం రక్షణ చట్టం చేయాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం..హిందూ మహిళలు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మాకు చెప్పండని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news